మంత్రిపై దాడి.. సజీవ దహనం చేసేందుకు యత్నం
ఈ క్రమంలోనే ఏర్పాట్లు సరిగా లేవంటూ కొందరు స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదికపైకి కుర్చీలను విసిరేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన స్థానికులు వేదికపై విరుచుకుపడ్డారు.
ససారంలో ప్రభుత్వ అధికారులపై దాడి చేయడంతో పాటు, మంత్రిని కూడా సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. మంత్రి అధికార వాహనంపై స్థానికులు పెట్రోల్ పోసి, నిప్పు పెట్టారు. ఆయనపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
స్థానికులు దాడి జరుపుతున్న సమయంలో రోహ్ తక్ జిల్లా ఎస్పీ కూడా అక్కడే ఉండట గమనార్హం. మంగళవారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన మంత్రి, తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందంటూ ఆరోపించారు.
విచక్షణ కోల్పోయిన యువకులు, కిరోసిన్ బాటిళ్లు చేతబట్టి, తనకోసం గాలించడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు. దీనిపై 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.