మోడల్పై డిఐజి అత్యాచారం: యువతిపై గ్యాంగ్రేప్
ముంబైలోని ధారావి ప్రాంతంలో కదులుతున్న కారులో ఆమెపై ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జులై 22న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు తనకు తెలుసునని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 25 నుంచి 30ఏళ్ల వయస్సు ఉన్నవారని, వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మోడల్పై డిఐజి అత్యాచారం
మరో ఘటనలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సీనియర్ ఐపిఎస్ అధికారిపై ఓ మోడల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిగా పేర్కొంటున్న సునీల్ పుష్కర్ అడిషనల్ కమిషనర్గా ఉన్న సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఘటనపై విచారణ జరపాలని పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా అధికారులను ఆదేశించారు. సునీల్ పుష్కర్పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం సునీల్ పుష్కర్ ప్రొటక్షన్ ఆఫ్ సివిల్స్ రైట్స్ యూనిట్ డిఐజిగా కొనసాగుతున్నారు.