గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ రాఖీలకు గిరాకీ
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో ఇప్పుడు రాఖీలు తయారవుతున్నాయి. రక్షాబంధన్ సమీపిస్తుండడంతో మోడీ పేరిట తయారైన రాఖీలు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రాచుర్యం ఏమిటో ఈ రకంగా మారోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా మార్మోగిన నమో మంత్రానికి వచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో తయారువుతున్న రాఖీలకు మంచి గిరాకీ వచ్చింది. రాజ్కోట్లోని రాఖీ బజారులో నమో రాఖీలు హాట్ కేకుల్లా అమ్ముడు అవున్నాయి.
ఈ నెల 8న జరగనున్న రక్షాబంధన్ వేడుకల కోసం ఇప్పటినుంచే ప్రజలు రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. రాఖీలు కొనడానికి వచ్చిన వారిని ఈ నమో రాఖీలు ఆకర్షిస్తున్నాయి. రూ. 40 నుంచి రూ. 50 లకు అమ్ముడు అవుతున్న మోదీ రాఖీలపై ఖుర్తా ధరించిన మోదీ బొమ్మ ఉంది. ఈ రాఖీలు 6 రంగుల్లో లభిస్తున్నాయి.