వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందీ ప్రసంగం, వాజ్ పేయి తర్వాత మోడీనే: రాజ్నాధ్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో హిందీలో ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాద్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. హిందీ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు.
సాధారణంగా ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొనే ఆ సమావేశంలో అందరూ ఆంగ్లంలోనే ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి హాజరైన భారత ప్రధానులు కూడా ఆంగ్లంలోనే ప్రసంగించారు. అయితే అందరికంటే భిన్నంగా వ్యవహరించే నరేంద్ర మోడీ, ఆ సమావేశంలో హిందీలో ప్రసంగించేందుకు నిర్ణయించుకున్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
గతంలో ఐక్యరాజ్యసమితి సమావేశంలో హిందీలో మాట్లాడిన తొలి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని గుర్తు చేశారు.
Comments
English summary
Prime Minister Narendra Modi will deliver his speech in the United National General Assembly in New York in Hindi, Home Minister Rajnath Singh said on Sunday.
Story first published: Sunday, September 14, 2014, 16:01 [IST]