నేనెవరంటే...!: రాసలీలల నిత్యానంద స్వామి వ్యాఖ్య
బెంగళూరు: రాసలీలల కేసు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. బిడది ఆశ్రమంలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిత్యానంద స్వామి మాట్లాడారు.
నిత్యానంద స్వామి తనకు తాను రక్త బీజాసుర దేవుడిగా అభివర్ణించుకున్నారు. తాను హిందూ అవతార్ పురుషుడినని చెప్పుకున్నారు.
కాగా, సినీ నటి రంజితతో రాసలీలలు, ఓ భక్తురాలి పైన అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద నిత్యానంద స్వామీ గత కొన్నేళ్లుగా మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు నిత్యానంద ఇటీవల పురుషత్వ పరీక్షలకు హాజరయ్యారు.
నిత్యానంద స్వామి బెంగళూరు శివారులోని బిడది ఆశ్రమాన్ని వదిలి.. తమిళనాడులోని తిరువణ్ణామలైలోని తన ఆశ్రమ శాఖకు వెళ్లాలనుకుంటున్నట్లుగా వారం రోజుల క్రితం బిడిది ఆశ్రమం ప్రకటన చేసింది. అయితే, ప్రస్తుతం ఆయన బిడిది ఆశ్రమంలోనే ఉంటున్నారు.