ఎన్కౌంటర్లపై సుప్రీం సీరియస్, ఫేక్ ఐతే అవార్డులొద్దు
న్యూఢిల్లీ: దేశంలో పోలీస్ ఎన్కౌంటర్ల పైన సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై సుప్రీం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్కౌంటర్ కేసుల విచారణను సీఐడీ ద్వారా చేపట్టాలని ఆదేశించింది. ఎన్కౌంటర్ వివరాలను రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేయాలని ఆదేశించింది.
ఎన్కౌంటర్ సమయంలో వినియోగించిన మందుగుండు సామగ్రిని పరీక్షలకు పంపించాలని తెలిపింది. ఎన్కౌంటర్లపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, న్యాయ విచారణకు ఆదేశించాలని ఆదేశించింది. ఫేక్ ఎన్కౌంటర్లలో పాల్గొన్న వారికి ప్రమోషన్లు, అవార్డులు ఇవ్వవద్దని సూచించింది.
ఎన్కౌంటర్ల పైన మెజిస్టేరియల్ విచారణ చేపట్టాలని తెలిపింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు ఆయుధాలను సరెండర్ చేయాలని తెలిపింది. సీఐడీ లేదా స్వతంత్ర న్యాయవ్యవస్థతో విచారణ జరిపించాలని సూచించింది.
యూపీలో ప్రమాదం, 11 మంది మృతి
ఉత్తర ప్రదేశ్లోని మధురలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.