వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోరే కాదు: ప్రియాంక, వరుణ్ వాగ్యుద్ధంపై మేనకా గాంధీ

By Pratap
|
Google Oneindia TeluguNews

No war at all: Maneka Gandhi on Priyanka-Varun war of words
న్యూఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ, తన కుమారుడు వరుణ్ గాంధీకి మధ్య జరిగిన వాగ్యుద్ధంపై బిజెపి నేత మేనకా గాంధీ స్పందించారు. అసలు సమరమే లేదని ఆమె బుధవారంనాడు అన్నారు. కాంగ్రెసు మాదిరిగానే తన కుమారుడు వరణ్ గాంధీ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారని ఆమె అన్నారు.

ఎన్నికలు జరుగుతున్నాయని, వరుణ్ గాంధీ తన తండ్రి సిద్ధాంతాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వరుణ్ గాంధీ ఎన్నికల పోరాటాన్ని తాను ఆహ్వానిస్తున్నానని, క్లిష్టమైన ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు తాను వరుణ్ గాంధీని ప్రశంసిస్తున్నానని ఆమె అన్నారు.

వారిద్దరి వాగ్యుద్ధం ఏ విషయాల మీద జరిగిందో తనకు తెలియదని ఆమె అన్నారు. వారు వారి ఎన్నికల పోరాటం చేస్తున్నారని, తన కుమారుడు తన పోరాటం చేస్తున్నాడని ఆమె అన్నారు. సంజయ్ గాంధీ వారసత్వం కోసం పోరాడుతున్నారా అని అడిగితే తాను తన కుమారుడి విషయంలో, తన భర్త విషయంలో గర్వంగా ఫీలవుతున్నానని ఆమె అన్నారు.

తన కుమారుడు తన తండ్రి నియోజకవర్గంలో పోటీ చేయడం గర్వంగా ఉందని మేనకా గాంధీ చెప్పారు. వరుణ్ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారో చూడడానికి తాను ఆ నియోజకవర్గానికి వెళ్లాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు.

English summary
In the midst of war of words between Priyanka Gandhi and her cousin Varun, Maneka Gandhi on Wednesday said there was no war and her son was fighting his elections just like Congress was fighting theirs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X