వీ సెల్యూట్ కార్గిల్ హీరోస్: విజయ్ దివస్ (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ సైనికుల సంక్షేమానికి తెలుగు ప్రభుత్వాలు రెండూపాటుపడాలని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలోని అమర వీరుల స్మారక స్థూపం వద్ద శనివారం జరిగిన కార్గిల్ దివస్లో నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల త్యాగాలను భారత జాతి మరువలేదన్నారు.
కార్గిల్ దివస్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలోని అమర వీరుల స్మారక స్థూపం వద్ద శనివారం జరిగిన కార్గిల్ దివస్లో నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
కార్గిల్ దివస్
శత్రువుల నుంచి దేశాన్ని రక్షించడానికి రేయింబవళ్లు శ్రమించిన మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కృషి చేయవలసిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉందని నాయిని అన్నారు.
కార్గిల్ దివస్
కార్గిల్ విజయం పదిహేను ఏళ్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద పలువురు శనివారం నివాళులు అర్పించారు.
కార్గిల్ దివస్
కార్గిల్ విజయం పదిహేను ఏళ్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద పలువురు శనివారం నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న దృశ్యం.
కార్గిల్ దివస్
ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మాజీ సైనికుల పేరిట కొందరు రాజకీయ నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని, వాటిపై సమగ్ర దర్యాప్తుచేసి, నిజమైన మాజీ సైనికులకు అందించడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
కార్గిల్ దివస్
మాజీ సైనికులకు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు చేయాలని దత్తాత్రేయ సూచించారు. మాజీ సైనికులకు స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగయ్య గౌడ్ కోరారు.
కార్గిల్ దివస్
కార్గిల్ విజయం పదిహేను ఏళ్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద పలువురు శనివారం నివాళులు అర్పించారు.
కార్గిల్ దివస్
ఏఐపీఎస్ఓ ఆధ్వర్యంలో కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం. కార్గిల్ విజయం పదిహేను ఏళ్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద పలువురు శనివారం నివాళులు అర్పించారు.