వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేడి నీటితో సరిపెట్టిన మోడీ: ప్లీజ్ తినండని ఒబామాతో..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ఇచ్చిన విందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనకు వైట్‌హౌజ్ ఘనస్వాగతం పలికింది. అయితే ఆయన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ అధ్యక్షుడి విందులో కేవలం వేడి నీటిని మాత్రమే తీసుకున్నారు.

తను ఉపవాసంలో ఉన్నానని చెప్పిన మోడీ.. దయచేసి మీరు డిన్నర్ చేయండని ఒబామాను, ఇతర మంత్రులు, ప్రతినిధులను కోరారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

 Please Eat, Said Fasting PM to Obama, Others at White House Dinner

ప్రోటోకాల్ ప్రకారం విందు సందర్భంగా మోడీ ముందు ఓ ప్లేటు పెట్టారు. అయితే మోడీ మాత్రం ఓ గ్లాసులోని వేడి నీటిని సేవించారు. ప్రతీ ఏడాది నవరాత్రుల సందర్భంగా ఎంతో కఠినంగా ఉపవాసం చేసే మోడీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. అందువల్లే ఆయన ఆహారం ఏమి తీసుకోకుండా నీటిని మాత్రమే తాగారు. ప్రస్తుతం ఆయన ఉపవాసం ఆరు రోజులకు చేరుకుంది.

ఆ విందులో మాంసాహారంతోపాటు శాకాహారన్ని కూడా ఏర్పాటు చేశారు. చేపలు, క్యారెస్ సాస్, అవకాడలు, మేక జున్ను, రోటీ క్రిస్ప్, లాంటి చాలా రకాల వంటకాలను అక్కడ ఉంచారు. మాంసాహారం సేవించేవారి కోసం కాలిఫోర్నియా వైట్ వైన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

English summary
At a dinner hosted by President Barack Obama at the White House, Prime Minister Narendra Modi had only warm water, but asked the rest of the guests not to feel awkward on his account and continue with their meal, a foreign ministry official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X