వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ పాదాభివందనం, కానుకగా రూ. 5001 (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన జన్మదినం సందర్బంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తల్లి హీరాబెన్ వద్ద మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆమె కుమారుడికి మిఠాయి తినిపించారు.

పుట్టిన రోజు సందర్బంగా మోడీకి బీజెపీ అగ్ర నాయకులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఫోన్‌లో మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జపాన్ ప్రధాని షింజో అబేలు మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి హీరాబెన్ నుంచి రూ.5001 లను జన్మదిన కానుకగా అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో తొలి జన్మదినాన్ని జరుపుకుంటున్న కుమారుడిని ఆశీర్వదించిన హీరాబెన్, రూ. 5001 లను జన్మదిన కానుకగా అందించారు. ఈ మొత్తాన్ని మోడీ, జమ్మూకాశ్మీర్ వరద బాధితుల సహాయనిధికి అందజేశారు.

ఇదిలా ఉంటే, జన్మదినం సందర్భంగా తల్లి దీవెనల కోసం అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే మోడీ, ఓ సాధారణ కారులో ప్రయాణించారు. కాశ్మీర్ వరదల నేపథ్యంలో ఎవరూ తన జన్మదిన వేడుకలను జరపవద్దన్న మోడీ, తాను కూడా తల్లి దీవెనలు తీసుకుని సరిపెట్టారు.

పుట్టినరోజు వేడుకులను జరపవద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే కార్యకర్తలు, మిత్రులు, ఇతర నేతలకు విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజు వేడుకలకు బదులు జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు సమయాన్ని, నిధులను కేటాయించి సాయం చేయాలని తన ట్వీట్స్ ద్వారా పిలుపునిచ్చారు.

 తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

తన 64వ పుట్టినరోజు సందర్బంగా తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.

 తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

జన్మదినం సందర్భంగా తల్లి దీవెనల కోసం అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే మోడీ, ఓ సాధారణ కారులో ప్రయాణించారు. కాశ్మీర్ వరదల నేపథ్యంలో ఎవరూ తన జన్మదిన వేడుకలను జరపవద్దన్న మోడీ, తాను కూడా తల్లి దీవెనలు తీసుకుని సరిపెట్టారు.

 తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి హీరాబెన్ నుంచి రూ.5001 లను జన్మదిన కానుకగా అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో తొలి జన్మదినాన్ని జరుపుకుంటున్న కుమారుడిని ఆశీర్వదించిన హీరాబెన్, రూ. 5001 లను జన్మదిన కానుకగా అందించారు.

తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

పుట్టినరోజు వేడుకులను జరపవద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే కార్యకర్తలు, మిత్రులు, ఇతర నేతలకు విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజు వేడుకలకు బదులు జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు సమయాన్ని, నిధులను కేటాయించి సాయం చేయాలని తన ట్వీట్స్ ద్వారా పిలుపునిచ్చారు.

English summary
On his 64th birthday, Prime Minister Narendra Modi sought mother's blessings at her home here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X