వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ కేసు: పరారీలో సదానంద గౌడ తనయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రేమ-పెళ్లి-మోసం ఆరోపణల నేపథ్యంలో పరారీలో ఉన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్తిక్‌ గౌడకు బెంగళూరు పోలీసులు సోమవారం అల్టిమేటం ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్లి చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడంటూ వర్ధమాన నటి మైత్రేయి గౌడ శుక్రవారం ఆర్‌.టి.నగర్‌ పోలీసులకు ఫిర్యా దు చేసిన సంగతి తెలిసిందే.

మైత్రేయి ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారంనాడే కార్తీక్‌ గౌడ నివాసానికి పోలీసులు నోటీసులు పంపగా అతడు అదృశ్యమయ్యాడు. అటుపైన ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించగా దీనిపై ఈ నెల 4న విచారణ జరగనుంది. ఈ లోగానే అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్న పోలీసులు, తాజా హెచ్చరిక జారీచేశారు.

Sadananda son

శుక్రవారంనాడు మైత్రేయిని పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. బుధవారం సదానంద తనయుడికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మైత్రేయి బెంగళూరులో తీవ్ర ఆరోపణలు చేసిన విషం తెలిసిందే.

తనను కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని సదానంద కుట్రగా అభివర్ణించారు.

English summary
Railway minister Sadananda Gowda's son Karthik Gowda is absconding. He has filed petition in a civil court in Bangalore seeking anticipatory bail in Maithreyi case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X