వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతుర్ని రేప్ చేశాడని, భార్యని గ్యాంగ్ రేప్ చేయించింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. తన కూతురు పైన ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని, ఆ వ్యక్తి భార్య పైన ఓ మహిళ నలుగురిచే సామహిక అత్యాచారం చేయించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని మరో మహిళపై తీర్చుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని అసంద పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్‌గర్‌లో ఇది జరిగింది. యువతిపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి జైలు శిక్ష పడింది. అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ శిక్ష బాధితురాలి తల్లికి సంతృప్తినివ్వలేదు.

Rape avenged by gangrape in UP

దీంతో తన భర్తతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను ఒప్పించి నిందితుడి భార్యపై అత్యాచారానికి పురికొల్పింది. నలుగురితో ఆమెను అత్యాచారం చేయించింది.

ఆ నలుగురు మృగాళ్లు నిందితుడి భార్యను అపహరించారు. గ్రామంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకు వెళ్లారు. అనంతరం అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. నిస్సహాయరాలిగా ఉన్న ఆమెను రోడ్డ పైన పడేసి పారిపోయారు. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
In a shocking incident, the mother of a rape victim got the wife of the accused gangraped by four men in a bid to avenge the wrong done to her daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X