విద్యార్థికి అసభ్య మెసేజ్లు: ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మాజ్గాన్ ప్రాంతంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఓ విద్యార్థి 10వ తరగతి పూర్తి చేసి పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ స్కూల్ పిటి టీచర్, అతను తరచూ మెసేజ్లు పంపుకుంటూ టచ్లో ఉన్నారు. ఈ క్రమంలోనే టీచర్ తాజాగా ఓ అసభ్యకర సందేశాన్ని ఆ విద్యార్థికి పంపించింది. ఈ విషయాన్ని విద్యార్థి స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు.
దీంతో స్కూల్ యాజమాన్యం ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని భావించింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్కూల్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది.
అసభ్య సందేశాల విషయంపై తమకు స్కూల్ నుంచి ఓ లేఖ అందిందని పోలీసులు తెలిపారు. కాగా, తాము నిందిత టీచర్కు ఈ విషయంపై మెమో జారీ చేసినట్లు, ఆమెకు అందే ఇంక్రిమెంట్ను నిలిపేస్తున్నట్లు స్కూల్ ఛైర్మన్ పింటో తెలిపారు.