ఘోరం: నడిచి వెళ్తున్న స్కూల్ టీచర్పై అత్యాచారం
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్లో ఆడవారిపై నానాటీకి అరాచకత్వం పెరిగిపోతోంది. కనీసం స్కూల్ టీచర్ని కూడా వదలడం లేదు. వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్లోని మైన్పురి జిల్లా నగ్లామధు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయునిపై ముగ్గురు వ్యక్తులు అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి, ఆమె వద్ద ఉన్న అభరణాలను దోచుకున్నారు.
ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. భాంగావ్ పోలీసుల వివరాల ప్రకారం నగ్లా మధు ప్రాంతంలోని పాఠశాలలో పని చేస్తున్న బాధితురాలు స్కూల్ కి నడిచి వళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను దారికాచి ఆమె వద్ద ఉన్న బంగారం గొలుసుతో పాటు ఐదు వేల రూపాయల నగదు దోచుకోవడానికి ప్రయత్నించారు.
దీనికి ఆమె తీవ్రంగా ప్రతిఘటించగా... రోడ్డు ప్రక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ సింగ్ తెలిపారు. నిందితుల్లో ఒకరని స్దానికులు పట్టుకోని పోలీసులకు అప్పగించారని..... మరో ఇద్దరు ప్రసుతం పరారీలో ఉన్నారని చెప్పారు. బాధితురాలిని సమీపంలో ఉన్న ఆప్సత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపారని తెలిపారు.