వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపురలో ఉన్నతాధికారులు తెలుగువారే, టీ ఆనందం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 TNGO leaders tour in Tripura
హైదరాబాద్/అగర్తాల: త్రిపుర రాష్ట్రంలో ఉన్నతాధికారులంతా తెలుగువారే ఉండటం పట్ల తెలంగాణ ఉద్యోగ నేతలు ముగ్ధులయ్యారు. త్రిపుర రాష్ట్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వంటి ఉన్నత స్థానాలలో తెలుగువారు ఉన్నారు. దీని పట్ల తెలంగాణ ఎన్జీవో నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

వారితో తెలుగులోనే మాట్లాడి ఆ రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. త్రిపురలోని సచివాలయాన్ని సందర్శించి ఉద్యోగులతోను మాట్లాడారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి తదితరులు త్రిపుర రాజధాని అగర్తాలకు వెళ్లారు.

అక్కడ ఈ నెల 12వ తేదీ నుండి నిర్వహిస్తున్న సమావేశాల్లో వారు పాల్గొన్నారు. చిన్న రాష్ట్రమైన త్రిపురలో అభివృద్ధి తీరు పైన తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో టీఎన్జీవో నేతలు ఓ నివేదిక అందజేయాలని భావిస్తున్నారు. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామేశ్వర రావు, డీజీపీ నాగరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి నాగరాజారావులను కలిసి అభివృద్ధి పైన తెలుసుకున్నారు.

English summary
TNGO leaders tour in Tripura for All India State govenment employees meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X