ఏటిఎం తెరిచేందుకు యత్నం: పోలీసులకు చిక్కారు
ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కీనర్లుగా పని చేస్తున్న నిందితులు రోహతాష్ చౌహాన్, గుల్షన్ తివారీలు ఛెలెరాలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరూ గత కొన్ని రోజుల నుంచి సెక్యూరిటీ గార్డులేని ఏటిఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ఈ ఇద్దరు నిందితులు సెక్టార్ 44లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. అది తెరచుకోకపోవడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆదివారం డిఎస్సి రోడ్లోని ఏటిఎంకు సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఆ ఏటిఎంను తెరిచేయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో వారు పోలీసులకు పట్టుబడ్డారని డిఎస్పీ రాజ్కుమార్ మిశ్రా తెలిపారు. ఓ స్క్రూడైవర్, హమ్మర్ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులను పట్టుకుని, ఏటిఎం చోరీని విఫలం చేసిన పోలీసులకు రూ. 5వేలను ఎస్ఎస్సీ ప్రీతిందర్ సింగ్ ప్రకటించారు.