వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికి అంగీకరించలేదని తుపాకీతో కాల్చుకున్నారు

|
Google Oneindia TeluguNews

two-lovers-shot-dead-muzaffarnagar
ముజఫర్‌నగర్: తమ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురైన ఇద్దరు ప్రేమికులు కలిసి జీవించలేకపోయినా కలిసే మరణించాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు తుపాకులు తీసుకున్న ప్రేమికులు ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారు. ఈ విషాధ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సీనియర్ ఇంటర్ విద్యనభ్యస్తిస్తున్న అంకుర్ (20), సరేష్టి (19) అనే ఇద్దరు యువతీ యువకులు గత కొంత కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వారిద్దరిదీ ఒకే కులమైనప్పటికీ వారి వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో అసహనానికి, ఆవేదనకు గురైన ప్రేమికులిద్దరూ బుధవారం నాడు కలిసి కాసేపే మాట్లాడుకున్నారు.

చావుతప్ప మరో దారిలేదని భావించిన ఆ ఇద్దరు ప్రేమికులు రెండు తుపాకులతో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల వచ్చిన ఓ బాలీవుడ్ సినిమాలో కూడా తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులిద్దరూ రెండు తుపాకులతో ఒకరినొకరు కాల్చుకుని చనిపోతారు. ఈ సినిమా తరహాలోనే ఈ ప్రేమికులు కూడా తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించారు.

English summary
Two lovers shot dead in Muzaffarnagar in Uttar Pradesh, after their parents dont accept their marriage proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X