వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో ఆగని దారుణాలు: మహిళపై గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల పర్వం ఆగడం లేదు. కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాతికేళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారంనాడు చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలోని బుధానా పట్టణంలో మంగళవారంనాడు ఆ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి పొలానికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు తన కూతురిపై అత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Woman abducted and gangraped in Muzaffarnagar

అత్యాచారం జరిగిన తర్వాత మహిళ తన ఇంటి వద్ద అచేతనావస్థలో పడి ఉందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

ముగ్గురు వ్యక్తులపై తాము కేసు నమోదు చేశామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) డి. మిశ్రా తెలిపారు. ఈ కేసులో రాజీవ్ సైనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

English summary
A 25-year-old woman was allegedly abducted and gangraped by three persons at Budhana town in the Muzaffarnagar district, police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X