దారుణం: తలకు తుపాకీ పెట్టి యువతిపై గ్యాంగ్రేప్
న్యూఢిల్లీ/పాట్నా: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని అడ్డగించిన నలుగురు యువకులు ఆమెను తుపాకీతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ. 5వేల నగదును దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని 8వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురకు చెందిన బాధిత యువతి గుర్గావ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో అడ్డగించిన నలుగురు యువకులు ఆమెను కారులో ఎక్కించుకుని 8వ జాతీయ రహదారిపై తుపాకీతో బెదిరింపులకు గురి సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఓ మహిళను వివస్త్రను చేసి వేధింపులకు పాల్పడి హత్యాయత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలోని నిజాముద్దీన్పూర్లో చోటు చేసుకుంది.