రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
న్యూఢిల్లీ: 2014 సంవత్సరానికి గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు వ్యక్తులకు నోబెల్ పురస్కారం లభించింది. ఎరిక్ బెట్ జిగ్, స్టీఫెన్ హెల్ అనే ఇద్దరు అమెరికన్లు, విలియం మోర్నర్ అనే జర్మన్ కు 'రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్' నోబెల్ ప్రకటించింది.
సూపర్ రిసాల్వడ్ మైక్రోస్కోపీని అభివృద్ధి చేసినందుకు గాను వారికి నోబెల్ లభించింది. ఈ ఏడాది ముగ్గురు చొప్పున వేరే విభాగాల్లో కూడా నోబెల్ బహుమతులను పొందారు. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురికి నోబెల్ వైద్య బహుమతి సంయుక్తంగా లభించింది. వీరిలో ఒకరు బ్రిటిష్- అమెరికన్ పరిశోధకుడు జాన్ ఒ కీఫ్. కాగా నార్వే దంపతులు.
నిన్న జపాన్కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, షుజి నకమురాలకు నోబెల్ బహుమతిని ప్రకటించింది. గురువారం నాడు సాహిత్యం విభాగంలో, శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి ఎవరనే విషయాన్ని ప్రకటిస్తారని నోబెల్ కమిటీ పేర్కొంది.