విమానం ఢీకొని తండ్రి, కూతురు మృతి: పైలట్ ‘సారీ’
ఓసియాన ఇజిర్రీ, ఆమె కుటుంబంతోపాటు వెనీస్లోని కాస్పర్సెన్ బీచ్కు వచ్చారు. ఆదివారం వారు బీచ్లో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఓ సింగిల్ ఇంజిన్ పైపర్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్ అయింది. ఆ విమానం వీరిని ఢీకొనడంతో ఒమ్మి ఇజర్నీ(36) అక్కడికక్కడ మృతి చెందగా.. అతని కూతురు ఓసియాన ఇజర్నీ(9)కు తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్పత్రి తరలిస్తుండగా ఆమె కూడా మృతి చెందింది. వీరిద్దరి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. విమానం ఇసుకలో క్రాష్ అయినప్పటికీ విమానంలో ఉన్న ప్రయాణికులకు, పైలట్కు ఎలాంటి గాయాలు కాలేదు.
కాగా, బీచ్లో తన విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేస్తున్నట్లు ఆ విమాన పైలట్ స్థానిక మున్సిపల్ ఎయిర్ పోర్టుకు సమాచారం ఇచ్చాడు. మంగళవారం ఆ పైలట్ మీడియాతో మాట్లాడుతూ.. విమానం ఢీకొనడంతో మృతి చెందిన ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపాడు. తాను వారిని(మృతులు) చూడలేదని, తనను దయచేసి క్షమించాలని కోరాడు. ఈ విమాన ప్రమాదంపై విమానయాన శాఖ అధికారులు విచారణ చేపట్టారు.