అంతర్జాతీయ వార్తలు
సయీద్ సవాల్: ఆధారాల కోసమే రివార్డన్న అమెరికావాషింగ్టన్/ఇస్లాబామాబ్: లష్కరే తోయిబా చీఫ్, ముంబయి దాడుల సూత్రదారుడు హఫీజ్ మహమ్మద్ సయీద్ను పట్టించినందుకు తాము రివార్డ్ ప్రకటించలేదని అమెరికా స్పష్టం చేసింది. తన ఆచూకి చెబుతానని దమ్ముంటే పట్టుకోవాలని అమెరికాకు సయీద్ సవాల్ చేసిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. సయీద్ ఎక్కడ ఉంటారో తెలుసునని, అయితే ఆయనను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో విచారణ కోసం అవసరమైన
తాత ఉరితీత అన్యాయం:సుప్రీంపై బిలావల్ ఎదురుదాడిఇస్లామాబాద్: తన తాత, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు దివంగత జుల్ఫికర్ అలీ భుట్టో ఉరితీత విషయంలో అన్యాయం జరిగిందని, న్యాయాన్ని సమాధి చేసినందుకు గాను సుప్రీం కోర్టు క్షమాపణలు చెప్పాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ బుధవారం అన్నారు. తన తండ్రి పాకిస్థాన్ అధ్యక్షుడిపై అవినీతి కేసులను తిరగదోడాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టు
పాకిస్తాన్ మొండితనం, సయీద్కు భద్రత పెంపుఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విషయంలో పాకిస్తాన్ తన మొండివైఖరిని విడనాడుతున్నట్లు కనిపించడం లేదు. జమాత్ - ఉద్ - దవా చీఫ్ హఫీజ్ సయీద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా అలా ప్రకటించిన తర్వాత సయీద్కు పాకిస్తాన్ భద్రతను పెంచింది. జౌహార్ పట్టనంలోని బ్లాక్ నివాసం వద్ద జమాత్
ఉన్మాది కాల్పులు: ఒక ఇండియన్ సహా 7గురు మృతివాషింగ్టన్: అమెరికాలో సహచర విద్యార్థులపై ఓ ఉన్మాది విచక్షణారహిత కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రింజింగ్ భూటియా అనే భారతీయుడితో సహా ఏడుగురు మృతి చెందారు. చనిపోయిన ఈ విద్యార్థి సిక్కింకు చెందిన వ్యక్తి. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. దేవీందర్ కౌర్ అనే భారతీయ విద్యార్థినికి మోచేతి వద్ద బుల్లెట్ గాయమైంది. క్యాలిఫోర్నియా
26/11 సూత్రదారి హఫీజ్పై అమెరికా $10మి.ల రివార్డ్వాషింగ్టన్: లష్కర్-ఇ-తోయిబాకు అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది. 26/11 ఘటనకు పథక రచన చేసిన లష్కర్-ఇ-తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ను పట్టించిన వారికి $10 మిలియన్ల డాలర్ల బహుమతి ప్రకటించింది. అమెరికా నిర్ణయంపై భారత దేశం హర్షం ప్రకటించింది. ఈ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పందించారు. హఫీజ్ పాకిస్తాన్లోనే ఉన్నారని ఆయన అన్నారు.