వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో సోదరుడ్ని కలిసింది, ఆమె మరణించింది

By Pratap
|
Google Oneindia TeluguNews

Indian meets brother in Pak, dies of heart attack
లాహోర్: పాకిస్తాన్‌లో విషాదకరమైన స్థితిలో భారత మహిళ మరణించింది. ఓ భారతీయ మహిళ 16 ఏళ్ల తర్వాత తన సోదరుడిని పాకిస్తాన్‌లోని లాహోర్‌ రైల్వే స్టేషన్‌లో కలిసిన వెంటనే గుండెపోటుతో మరణించింది.

సరళ జెవాత్రం బద్లానీ లర్కానాలో నివసిస్తున్న తన సోదరుడు మహేష్ కుమార్‌ను కలవడానికి వచ్చింది. తన సోదరి వచ్చిన వెంటనే తనను కౌగలించుకుని బోరున విలపించడం ప్రారంభించిందని మహేష్ కుమార్ చెప్పారు. 16 ఏళ్ల తర్వాత తన సోదరుడిని కలిసిన ఆనందాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మహారాష్ట్రలోని ఉల్హసన్‌నగర్‌లో ఆమెకు పాస్‌పోర్టు జారీ ఏయింది.

తన సోదరి వీసాను నాలుగు సార్లు తిరస్కరించారని, ఐదో సారి దరఖాస్తుకు వీసా జారీ చేశారని, దాంతో ఆమె లాహోర్‌కు రాగలిగిందని మహేష్ కుమార్ చెప్పారు. తన సోదరి శవాన్ని తీసుకుని వెళ్లడానికి తన కుటుంబానికి వెంటనే వీసాలు ఇవ్వాలని ఆయన జియో టీవీతో మాట్లాడుతూ కోరారు.

అంత్యక్రియలకు హాజరు కావడానికి వీసాకు మహేష్ కుమార్ దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్యతా ప్రాతిపదికపై ఇస్తామని భారత హై కమిషన్ అధికారులు పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. మానవతా దృక్పథానికి, వైద్యానికి సంబంధించిన వీసాలను ప్రాధాన్యతా ప్రాతిపదికపై జారీ చేస్తున్నట్లు తెలిపారు.

English summary
An Indian woman, who arrived in Pakistan to meet her brother after a span of 16 years, has died after a severe heart attack at the Lahore railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X