వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడనున్న ఎంహెచ్370 మిస్టరీ: 58వస్తువుల గుర్తింపు!

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: ఆరు నెలల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 గాలింపులో ఓ ముందడుగు పడినట్లు కనిపిస్తోంది. మలేషియా విమానం ఎంహెచ్ 370కి సంబంధించినవిగా భావిస్తున్న 58 దృఢ వస్తువులను హిందూ మహాసముద్రంలో గుర్తించినట్లు ఆస్ట్రేలియా నేతృత్వంలో గాలింపు చేపడుతున్న ఓ బృందం వెల్లడించింది.

విమానానికి సంబంధించిన శకలాలుగా భావిస్తున్న వస్తువులని జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్(జెఏసిసి) పరిశీలిస్తోందని మలేషియా రవాణా శాఖ మంత్రి లియో టియాంగ్ లై మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తాము 58 దృఢమైన వస్తువులను గుర్తించామని, అయితే అవి ఎంహెచ్ 370 విమానానివేనా? లేక సముద్రం అడుగున ఉన్న రాళ్లా అన్న విషయంపై అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు.

MH370 Mystery: 58 'Hard Objects' Found in Indian Ocean

అందుకుగాను చమురు అన్వేషణలో ఉపయోగించే గో ఫినిక్స్ నౌక సహాయంతో మలేషియాకు చెందిన పెట్రోనాట్స్ దక్షిణ హిందూ మహాసముద్రంలో మోహరించి పరిశీలన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది సెప్టెంబర్ 21 నాటికి పెర్త్ చేరుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతయిన విషయం తెలిసిందే. కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు వెళ్తున్న ఈ విమానంలో 239 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు ఉన్నారు. క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ తరవాత ఎంహెచ్ 17 ప్రమాదంలో 298 మంది చనిపోయారు.

English summary
The Australia-led search team for the missing Malaysian flight MH370 has discovered 58 hard objects inconsistent with the Indian Ocean seabed, raising hopes of solving the over six months-long aviation mystery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X