'ఛలే సాత్ సాత్': మోడీ, ఒబామా కలిసి సంపాదకీయం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోడీ కలిసి అమెరికాలోని ఓ ప్రముఖ దినపత్రికకు ఉమ్మడి సంపాదకీయం రాశారని విదేశాంగ శాఖ అధికార ప్రధాని సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.
అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని ఇద్దరూ కలిసి సంపాదకీయం రావడం ఇదే మొదటసారి అని అక్బరుద్దీన్ వెల్లడించారు. బరాక్ ఒబామాతో డిన్నర్ అనంతరం ఈ సంపాదకీయం రాశారని ఆయన పేర్కొన్నారు.
రేపు అమెరికాలోని ప్రముఖ దినపత్రికలో ఇది ప్రచురితమవుతుందని అన్నారు. సోషల్ మీడియాను, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకునే ఇద్దరు నేతలు ముందుగానే సంప్రదించుకోని సంపాదకీయం రాసినట్లు అక్బరుద్దీన్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇచ్చిన అధికారక విందులో ప్రధాని నరేంద్రమోడీ కేవలం మంచి నీళ్లు మాత్రమే తీసుకున్నారని చెప్పారు. దాదాపు తొంబై నిమిషాలపాటు విందు సమయంలో ఇరు దేశాల అధినేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు.