పాక్లోని హిందూ ఆలయాలపై ఆమె పుస్తకం తెచ్చింది
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందిన మహిళా రచయిత రీమా అబ్బాసీ జూలై 23వ తేదీన ఓ పుస్తకాన్ని లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ పుస్తకం పాకిస్తాన్లోని హిందూ దేవాలయాల గురించి.
'హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ పాకిస్తాన్ - ఏ కాల్ టు కాన్సైన్స్' పేరిట ఆమె పుస్తకాన్ని లాంచ్ చేస్తారని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
రీమా అబ్బాసీ విడుదల చేస్తున్న ఈ పుస్తకంలో హిందు దేవాలయాలు, పాకిస్తాన్లో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన 400 ఫోటోగ్రాప్లను ఉంచారట.
రీమా అబ్బాసీ
పాకిస్తాన్కు చెందిన మహిళా రచయిత రీమా అబ్బాసీ జూలై 23వ తేదీన ఓ పుస్తకాన్ని లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ పుస్తకం పాకిస్తాన్లోని హిందూ దేవాలయాల గురించి.
రీమా అబ్బాసీ
ఈ పుస్తకం ద్వారా సామరస్యంతో పాటు భారత్ దేశంతో మంచి సంబంధాల కోసం ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడుతున్నారట. ఈ పుస్తక ఆవిష్కరణకు పాకిస్తాన్లో జన్మించిన అద్వానీని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారట. అయితే చివరి నిమిషంలో ఆయన వెళ్లలేకపోయారట.
రీమా అబ్బాసీ
రీమా అబ్బాసీ రీసెర్చర్ అండ్ ఆథర్. ఈమె ఈ ఫోటోగ్రాఫ్లు సేకరించేందుకు, వాటి గురించి తెలుసుకునేందుకు ఫోటో గ్రాఫర్తో కలిసి ఏడాది పాటు కష్టపడ్డారట.
రీమా అబ్బాసీ
రీమా అబ్బాసీ పుస్తకంలో... హింగ్లాజ్, కతాస్ రాజ్, కల్కా కేవ్ టెంపుల్, పంచముఖి హనుమాన్ మందిర్, శివాలా మందిర్ తదితర ఆలయాల గురించి ఉన్నాయట.
రీమా అబ్బాసీ
ఈ పుస్తకంతో అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఈ పుస్తకం సమష్టివాదానికి జర్నీగా పనికి వస్తుందని భావిస్తున్నారు.