వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమర్జెన్సీ ల్యాండింగ్, కూలిన విమానం: 51 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Taiwanese plane crashes
తైపే: తైవాన్‌కు చెందిన ఓ విమానం కూలగా 51 మంది మృతి చెందారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న 51 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విమానంలో మొత్తం 58 మంది ఉన్నారు.

కాగా, ఈ విమానం ప్రమాదంలో మృతుల పైన రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్సీ ప్రకారం నలభై మందికి పైగా మృతి చెందారు. అయితే, స్థానిక మీడియా మాత్రం 51 మంది మృతి చెందగా, 7గురు మృతి చెందారని చెబుతోంది.

ప్రమాదం సంభవించిన విమానం ట్రాన్స్ ఏషియా ఎయిర్ వేస్ విమానం. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో టైఫూన్ ప్రభావంతో గాలులు, భారీ వర్షపాతం చోటు చేసుకంది. వాతావరణం అనుకూలించక పోవడంతోనే విమానం కూలిపోయిందంటున్నారు. విమానం తైవాన్ రాజధాని తైపే నుండి పెంఘుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

English summary
Taiwanese plane crashes in emergency landing, 51 feared dead and seven injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X