ఏషియన్ గేమ్స్
ఏషియన్ గేమ్స్కు ముందు భారత్కు షాక్! తన కోచ్, మరో అంతర్జాతీయ ప్లేయర్ తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళా జిమ్నాస్ట్ ఫిర్యాదు చేశారు.
ఏషియన్ గేమ్స్
సమాచారం మేరకు.. వారిద్దరు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని సదరు మహిళా జిమ్నాస్ట్ ఫిర్యాదు చేశారు.
ఏషియన్ గేమ్స్
ఆసియన్ గేమ్స్ కోసం జరిగిన శిక్షణ కార్యక్రమం ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. ఈ సమయంలో వారు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.
ఏషియన్ గేమ్స్
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిద్దరు తన గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీశారని, అంతేకాకుండా తనను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు.
ఏషియన్ గేమ్స్
కాగా, సదరు మహిళా జిమ్నాస్ట్కు క్షమాపణ చెప్పాలని వారిద్దరినీ ముఖ్య శిక్షకుడు కోరినప్పటికీ వారి నిరాకరించారని తెలుస్తోంది.
ఏషియన్ గేమ్స్
ఈ సంఘటన సెప్టెంబర్ 2వ తేదీన జరిగింది. ఈ సంఘటనను ఇండియన్ జిమ్నాస్ట్ ఫెడరేషన్ దృష్టికి కూడా సదరు మహిళా జిమ్నాస్ట్ తీసుకు వెళ్లారు.
ఏషియన్ గేమ్స్
ఈ విషయమై సదరు మహిళా జిమ్నాస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఆసియాడ్ క్రీడల కోసం ఇంచియాన్ వెళ్లిన నిందితులు మనోజ్ రాణా, చంద్రన్ పాఠక్లను తక్షణమే తిరిగి రావాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.