న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించనుంది. తొలి రోజు శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్ జట్టును 3-2తో ఓడించి సెమీస్కు చేరింది. దీంతో ఈ జట్టుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. 1986 సియోల్ గేమ్స్ తర్వాత భారత్కు ఈ క్రీడలో ఏ విభాగంలోనూ పతకం రాలేదు.
28 ఏళ్ల క్రితం పురుషుల టీమ్ ఈ విభాగంలో భారత్కు కాంస్యం లభించింది. క్వార్టర్ తొలి సింగిల్స్ మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21-15, 17-21, 21-18 తేడాతో ప్రపంచ మాజీ ఛాంపియన్ రచనోక్ ఇంటనోన్ను ఓడించి భారత్కు శుబారంభాన్నందించింది.
ఇక రెండో సింగిల్స్లో పివి. సింధు 21-15, 21-13తో పోర్న్టిప్ పై సునాయాసంగా నెగ్గి భారత్కు 2-0తో అధిక్యాన్ని అందించింది. దీంతో భారత్ సెమీస్ చేరడమిక లాంఛనమే అనిపించింది. కానీ మూడో సింగిల్స్ లో బుసానన్ చేతిలో తొలి డబుల్స్లో సిక్కిరెడ్డి-ప్రద్న్య గాద్రె జోడి 17-21, 21-18, 16-21తో పోర్న్ టిప్ - కుంచల జంట చేతిలో ఓడటంతో మ్యాచ్ స్కోరు 2-2తో సమానమైంది.
ఈ స్దితిలో చివరి డబుల్స్లో సిధు-అశ్విని జోడీ అద్బుతంగా ఆడి భారత్ను విజేతగా నిలిపింది. డబుల్స్లో సింధు-అశ్విని జోడీ అధ్బుతంగా ఆడి భారత్ను విజేతగా నిలిపారు. ఈ జోడీ 21-16, 21-17తో సప్సిరి-సరలీ జంటను ఓడించింది.
ఇక ఆదివారం జరిగే సెమీస్లో భారత్, కొరియాను ఢీకొంటుంది. అంతక ముందు జరిగిన పురుషుల ఫ్రీ క్వార్టర్స్ పోరులో భారత్ 0-3తో కొరియా జేతిలో ఘోరంగా ఓడింది.