సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్
దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్లో భారత మహిలా బాక్సర్ సరితా దేవి కాంస్యపతకాన్ని గెలిచింది. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్లో దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ జేతిలో సరితా దేవి ఓడిపోవడంతో కాంస్యం దక్కింది.
సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్
32ఏళ్ల సరితా దేవి, దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో ఓటమి అనంతరం బాక్సింగ్ రింగ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కారణం బాక్సింగ్ రింగ్లో అత్యుత్తమ ప్రదర్సనను కనబర్చినా.. జినా పార్క్ను విజేతగా న్యాయమూర్తులు ఎంపిక చేసిన తీరు సరిగ్గా లేదని వాపోయింది.
సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్
ఐతే బాక్సర్ సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆమె భర్త ఆరోపించారు. సెమీస్లో జరిగిన బౌట్లో సరితా పూర్తి ఆధిపత్యం కనబర్చినా.. చివరకు న్యాయమూర్తులు జీనా పార్క్ గెలిచినట్లు ప్రకటించడంతో సరితా దేవి ఆగ్రహానికి గురైంది. ఇది తప్పుడు నిర్ణయంగా సరితా దేవి భర్త తోయిబా సింగ్ అన్నారు.
సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్
తొలి రౌండ్లో బాక్సర్లు ఇద్దరు దూకుడుగా వ్యవహరించాల్సి ఉన్నా... సరితా దేవి ఆ అవకాశాన్ని వినియోగించుకోలక పోయింది. ఐతే రెండో రౌండ్లో తన పంచ్లతో జినా పార్క్ గడ్డాన్ని తాకిన ప్రయోజనం లేకపోయింది.
సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్
సరితా దేవి ఓటమి వెనుక మ్యాచ్ ఫిక్సింగ్