గ్లాస్గో: భారత్కు చెందిన జితూ రాయ్ 2014 కామన్వెల్త్ క్రీడల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో కొత్త రికార్డు సృష్టించాడు. అతను స్వర్ణపతక సాధించాడు. సోమవారం అతను ఈ రికార్డు సృష్టించాడు. గురుపాల్ సింగ్ వెండి పతకం సాధించాడు.
సైనికుడైన రాయ్ 194.1 పాయింట్లతో కొత్త రికార్డును సృష్టించాడు. గురుపాల్187.2 పాయింట్లు సాధించాడు. దాంతో అతను రెండో స్థానంలో నిలిచాడు.
26 ఏళ్ల జితూ లక్నోలో జరిగిన క్వాలిఫయింగ్లో 562 పాయింట్లతో రికార్డు సాధించాడు. ఈ నెలారంభంలో జరిగిన పిస్టల్ ఈవెంట్లో ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిచాడు. ఒక ప్రపంచ కప్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
50 మీటర్ల రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్కు సిల్వర్ మెడల్ లభించింది.