న్యూఢిల్లీ: గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ మహిళా స్క్వాష్ ప్లేయర్లు దీపికా పల్లికల్, జ్యోష్న చిన్నప్పలు స్వర్ణం సాధించారు. అయితే, వీళ్లలో దీపిక గురించి సోషల్ వెబ్సైట్లలో ఎక్కువగా చర్చ సాగుతోంది. కాగా, దీపికను ముందుండి నడిపించింది, ఆమెకు స్ఫూర్తినిచ్చింది.. క్రికెటర్ దినేష్ కార్తీక్.
దీపిక పల్లికల్ మ్యాచ్లో సమర్థవంతంగా, సమయస్ఫూర్తిగా ఆడి పాయింట్లను చకచకా సాధించింది. ఆమె మానసిక దృఢత్వాన్ని పెంచిన వ్యక్తి అతనేనట.
'నా వాడు నాతోడుండగా పతకం సాధించా'నని స్వర్ణం సాధించిన తరువాత దీపిక ట్వీట్ చేసింది. ఆ మేజికల్ రోజున నావాడు నాకు తోడుంటే ఎంత బాగుండేదో అని ట్వీట్ చేసింది. తన కాబోయే భార్య సాధించిన విజయం పట్ల ఎంతో గర్విస్తున్నానని దినేష్ కార్తీక్ కూడా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ను ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ రీ ట్వీట్ చేశాడు.
కాగా, దీపిక, దినేష్లకు 2013 నవంబరులో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ ఫిట్నెస్ పాఠాలు ఒక్కరి దగ్గరే నేర్చుకోవడంతో.. అక్కడే వీరు ప్రేమలో పడ్డారు. కీపర్ బ్యాట్స్మన్ అయిన దినేష్ కార్తిక్ అత్యుత్తమ ఫీల్డర్ కూడా.