తప్పుల వల్లే ఇలా..
తాను చేసిన చేసిన తప్పుల వల్లే సెమీస్లో ఓడిపోయానని, తన స్థాయికి తగ్గట్లు ఆడలేదని అందరూ చెప్పారని, భవిష్యత్లో పొరబాట్లకు తావివ్వనని చెప్పింది.
పాఠాలు నేర్చుకుంటున్నా..
మ్యాచ్లు ఆడుతున్నప్పుడు చేసిన పొరపాట్లు నుంచి పాఠాలు నేర్చుకుంటున్నానని ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకాన్ని సాధించిన హైదరాబాదీ పివి సింధు చెప్పింది.
తప్పిదాలతోనే పాఠాలు..
తప్పిదాలే ఎన్నో పాఠాలు నేర్పుతాయని పివి చెప్పింది. నూటికి నూరు శాతం రాణించడం ఎవరికైనా అసాధ్యమని సింధు వ్యాఖ్యానించింది.
కలిసే సాగుతాయి..
విజయాలు, పరాజయాలు కలిసి సాగుతాయని సింధు చెప్పింది. సెమీ ఫైనల్స్లో తాను మరింత మెరుగ్గా రాణించి ఉండేదానినని, కానీ, కొన్ని చిన్నచిన్న పొరపాట్లే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించాయని చెప్పింది.
గోపీచంద్ ప్రశంసలు..
19 ఏళ్ల వయసులో ఎన్నో అంతర్జాతీయ టైటిళ్లను అందుకున్న సింధుకు మంచి భవిష్యత్తు ఉందని గోపీచంద్ అన్నాడు.