న్యూఢిల్లీ: చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి, ఆ ప్రతిభను పేపొందించేదుకు భారతదేశంలో ఓ వ్యవస్ద లేకపోవడంపై క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్దాయి మ్యాచ్ల్లో పోటీపడేందుకు మన యువతకి ఆలస్యం అవుతుందని అన్నాడు.
వివరాల్లోకి వెళితే... కేరళలోని కొచ్చిలో ఇండియన్ సూపర్ లీగ్ టీమ్ కేరళ బ్లాస్టర్స్కు చెందిన జెర్సీతో పాటు ధీమ్ సాంగ్ను ప్రారంభించిన తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడారు. "చాలా దేశాల్లో చిన్న వయసులోనే ప్రతిభను గుర్తిస్తున్నారు. ఐతే భారతదేశంలో మాత్రం ఇది జరగడం లేదు. మన టాలెంట్ను గుర్తించినప్పటికే వారు టీనేజీలో ఉంటారు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో పోటీపడటానికి అప్పటికే ఆలస్యం అవుతుంది." అని అన్నారు.
లోకల్ టాలెంట్ను గుర్తించి తప్పకుండా ప్రోత్సహిస్తామని అన్నారు. అందులో భాగంగా దిలిప్ మీనన్ త్వరలోనే జట్టులోకి చేరనున్నాడని తెలిపారు. కేరళ బ్లాస్టర్స్ జెర్సీ రంగు పసుపుకి ప్రచారం కల్పించేందుకు గాను "ఎల్లో మే ఖేలో" అంటూ సచిన్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో జట్టు అభిమానులు పసుపు రంగు దుస్తులు ధరించి జట్టుకు మద్దతు తెలపాల్సిందిగా కోరాడు.
"ఎల్లో మన కలర్. ఈ రంగులో ఉన్న ఫోటోలు పంపి కేరళ బ్లాస్టర్స్కు మద్దతు తెలపండి" అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు సచిన్.