ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారతదేశానికి తొలి స్వర్ణపతకం దక్కింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో షూటర్ జీతూ రాయ్ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్లో జీతూ రాయ్ 186.2 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
అదే విధంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్య పతకం సాధించింది. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత మహిళలు క్వార్టర్స్కు చేరుకున్నారు. ప్రీక్వార్టర్ ఫైనల్లో మకావూను 3-0 తేడాతో భారత్ ఓడించింది.
ఇదిలావుంటే, వాన్హో సన్ శ్రీకాంత్ కిదాంబిని 21 -14, 21-8 స్కోరుతో ఓడించాడు. దీంత బ్యాడ్మింటన్ టీమ్ పురుషుల ఈవెంట్లో భారత్పై కొరియా 1-0 స్కోరుతో ఆధిక్యతలో ఉంది.