న్యూఢిల్లీ: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 'ఫోర్బ్స్' ఇండియా సంపన్న ఆటగాడిగా నిలిచాడు. ధోని ఈ ఏడాది ఆదాయం రూ.141.80 కోట్లు. భారత సంపన్న సెలబ్రిటీల జాబితాలో ధోనీ నాల్గవ స్థానంలో ఉన్నాడు.
ఫోర్బ్స్ మేగజైన్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు అగ్రస్థానం దక్కింది. సల్మాన్ ఖాన్ రూ.244 కోట్లతో మొదటి స్ధానంలో ఉండగా... తర్వాత స్థానాల్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఉన్నారు.
టాప్-10 జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. కోహ్లీకి 6వ స్థానం, సచిన్కు 10వ స్థానం లభించాయి. అంతకుముందు, అక్టోబరులో 'ఫోర్బ్స్' విడుదల చేసిన వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్ పర్సన్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు ధోనీయే. జార్ఖండ్కు చెందిన ధోనికి ఆ జాబితాలో 22వ స్ధానం దక్కింది.