సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్కు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగా కసరత్తు చేసి ఇవ్వలేదట. కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే, అదీ సచిన్ 200వ టెస్టు ఆడిన మరుసటి రోజు ఖరారు చేసిందట.
సచిన్
భారతరత్న అత్యున్నత పురస్కారం. దీనిని సచిన్ టెండుల్కర్కు ఇవ్వాలనే వాదన చాలా రోజులుగా ఉంది. సచిన్ పేరును భారతరత్నకు అనుకున్నప్పుడల్లా ధ్యాన్ చంద్ వంటి పేర్లు కూడా వినిపించాయి.
సచిన్
గత ఏడాది సచిన్కు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు. సచిన్కు భారతరత్న కేంద్రం ముందుగా ఆలోచించి, కసరత్తు చేసి ఖరారు చేయలేదని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగు చూసింది.
సచిన్
నవంబర్ 14న సచిన్ ముంబై వాంఖెడే స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో సచిన్ వివరాలు పంపాలని ప్రధానమంత్రి కార్యాలయం క్రీడా శాఖను అదే రోజు మధ్యాహ్నం 1.35 నిమిషాలకు కోరింది.
సచిన్
అక్కడి నుండి వివరాలు సాయంత్రం 5.22 నిమిషాలకు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నాయి. మరుసటి రోజు అంటే నవంబర్ 15న ప్రధాని దానికి ఓకే చెప్పారు. వెంటనే సచిన్ పేరును భారతరత్నకు సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫైలును పంపించారు.