న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీమా పూనియా, సానియా జోడిలకు స్వర్ణాలు

By Nageswara Rao

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. డిస్కస్ త్రోలో సీమా పూనియా ఈ స్వర్ణం సాధించారు. దీంతో ఆసియా గేమ్స్‌ పతకాల పట్టికలో భారత్‌కు ఐదో స్వర్ణం వచ్చి చేరింది.

నాలుగు రౌండ్లలో డిస్కస్ త్రోని 55.76, 57.00, 59.36, 61.03 దూరం విసిరింది. దీంతో సీమా పూనియా అత్యధిక స్కోరు నమోదు చేసి మొదటి స్దానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

ఇక టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రీడాకారులు సానియా, సాకేత మైనేని జోడీ స్వర్ణం గెలుచుకుంది. పైనల్ మ్యాచ్‌లో ఇన్ పెంగ్, చాన్ జంటను 6-4, 6-3 తేడాతో ఓడించారు. దీంతో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

Seema Punia wins gold medal in Women’s Discus Throw in Asian Games 2014

నాలుగో స్దానంతో త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది కృష్ణ పూనియా. ఇక 3000కిమీ స్టీపల్ చేజ్‌లో నవీన్ కుమార్ కాంస్యం సాధించాడు. ఇంచియాన్‌లో ఈరోజు జరిగిన పోటీల్లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో పైనల్‌కు చేరిన భారత టెన్నిస్ జోడీ సాకేత్ సాయి మైనేని, సనమ్ సింగ్ రజతం సాధించారు.

61 కిలోల ప్రీస్టయిల్ రెజ్లింగ్‌లో భారత క్రీడాకారుడు భజరంగ్ రజతం సాధించాడు. 74 కిలోల ప్రీస్టయిల్ రెజ్లింగ్‌లో నర్సింగ్ యాదవ్ కాంస్య పతకం గెలిచాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో జైషా కాంస్యం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X