భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్కు కాంస్యం
ఆసియా గేమ్స్లో సోమవారం స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్కు కాంస్యం అందించింది.
భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్కు కాంస్యం
దీపికా మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ పైనల్స్లో మలేషియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ నికోల్ డేవిడ్ చేతిలో ఓడింది. 25 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 12 అయిన దీపిక పల్లికల్ 11-4, 11-4, 11-5 తేడాతో నికోల్పై ఓడిపోయింది.
భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్కు కాంస్యం
ఆసియా గేమ్స్లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు కాంస్య పతకం సాధించిన దీపిక పల్లికల్కు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షల నజరానా ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నగదు బహుమతితో పాటు లేఖ ద్వారా అభినందులు తెలిపారు.
భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్కు కాంస్యం
ఆసియా గేమ్స్లో భారత్కు మరో పతకం లభించింది. 25 మీటర్ల మహిళల పిస్టల్ టీమ్ విభాగంలో కాంస్య పతకం దక్కింది. టీమ్ ఈవెంట్లో హీనా, స్నోబర్, అనీసాలు పతకం సాధించారు. ఇక బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం సాధించింది.