సింగపూర్: తెలుగుతేజం శ్రీకాంత్ మరోసారి సంచలనం సృష్టించాడు. సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంటులో ప్రపంచ పదో ర్యాంక్ ఆటగాడు తియెన్ మిన్ గుయెన్ (వియత్నాం)ను ఓడించడం ద్వారా భారత యువ బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. ఇ
సింగపూర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో అతను గుయెన్పై 18-21, 21-18, 21-15 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్లో అతను హాంకాంగ్కు చెందిన యున్ హూను ఢీ కొంటాడు. మేబ్యాంక్ మలేసియా ఓపెన్ టోర్నీలో యున్ హూను శ్రీకాంత్ ఓడించాడు.
మరో మ్యాచ్లో సాయి ప్రణీత్ 24-22, 21-19 స్కోరుతో అతి కష్టం మీద జిలియాంగ్ డెరెక్ వాంగ్పై విజయం సాధించి క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. అయితే, పెంగ్యు డు చేతిలో భారత ఆటగాడు ప్రణయ్ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. పెంగ్యు 21-17, 18-21, 21-12 తేడాతో గెలుపొందాడు. ప్రణయ్ చివరి వరకూ గట్టిపోటీనిచ్చినా ఫలితం లేకపోయింది. పారుపల్లి కశ్యప్ 16-21, 21-15, 22-20 తేడాతో డాంగ్ కెయున్ లీని ఓడించాడు.
క్వార్టర్ ఫైనల్లోకి సింధు..
మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కోగా, మరో హైదరాబాదీ పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. షిజుకా ఉషిదాను ఆమె 21-17, 17-21, 21-16 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్లో పిసి తులసి పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. ఆమెను ఇహాన్ వాంగ్ 21-19, 21-7 ఆధిక్యంతో చిత్తుచేసింది.
పురుషుల డబుల్స్లో భారత ఆటగాళ్లు అల్విన్ ఫ్రాన్సిస్ అరుణ్ విష్ణు 17-21, 22-24 తేడాతో మహమ్మద్ అసన్, హెండ్రా సెతియావన్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ను గితియాన్ మార్కస్ ఫెర్నాల్డీ, రిజ్కీ అమెలియా ప్రదీప్తా జోడీ 23-21, 21-17 తేడాతో ఓడించింది.