ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్తో తనకు సంబంధాలు అంటగడుతూ మీడియాలో వస్తున్న వార్తల పైన ప్రముఖ నటి హుమైమా మాలిక్ స్పందించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని ఆమె వివరణ ఇచ్చారు. తామిద్దరం ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని చెప్పారు.
తమ మధ్య ఏదో ఉందన్న వార్తలు ఎక్కడ నుండి వస్తున్నాయో తనకు ఏమాత్రం అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ్ ఓ వివాహితుడు, పైగా ఓ తండ్రి కూడా అని ఆమె పేర్కొన్నారు. అతడిని తాను గౌరవిస్తానని పేర్కొన్నారు.
ఇలాంటి పుకార్లు తమ మధ్య ఉన్న మంచి స్నేహాన్ని దెబ్బతీయలేవని తెలిపారు. తమ మధ్య మాత్రం ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన గురించి తన కుటుంబ సభ్యులకు పూర్తిగా తెలుసునని చెప్పారు. తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే తప్పకుండా చెబుతానని అన్నారు.
ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో ఇమ్రాన్ హష్మి సరసన 'రాజా నట్వర్ లాల్' చిత్రంలో నటించనుంది. హుమైమా ఇంతకుముందు సంజయదత్ సరసన 'షేర్' సినిమాలో నటించారు.