జైపూర్: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎన్నాళ్లుగానో సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా విరాట్ కోహ్లీని చూసిన అనుష్క శర్మ ఓ సినిమా షూటింగులో ఇరవై టేకులు తీసుకున్నారట. ట్వంటీ 20 ప్రపంచ కప్ పర్యటన ముగించుకొని వచ్చిన కోహ్లీ భారత్లో అడుగు పెట్టగానే అనుష్క కోసం వెళ్లారట.
ఓ సినిమా షూటింగు కోసం అనుష్క శర్మ రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్లారు. ఇది తెలిసిన విరాట్ అక్కడకు వెళ్లారు. కోహ్లీ వచ్చిన సమయంలో అనుష్క శర్మ సినిమా సెట్ పైన ఉందట. కోహ్లీని చూసిన అనుష్క శర్మ... ఒక్క సీన్ కోసం ఇరవై టేకులు తీసుకున్నారట.
కాగా, బంగ్లాదేశ్లో జరిగిన ట్వంటి20 ప్రపంచ కప్ ముగించుకుని స్వదేశానికి చేరిన టీమిండియా క్రికెటర్లంతా నేరుగా తమ తమ ఇళ్లకు వెళితే.. యువ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రియరాలు బాటపట్టాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను కలిసేందుకు రాజస్థాన్ వెళ్లాడు.
అప్పటికే సినిమా షూటింగు నిమిత్తం అనుష్క అక్కడే ఉన్నారు. ఇంకేముంది ఇద్దరూ కలిసి ఖేజర్లా కోటలో చెట్టాపట్టాలేసుకుని విహరించారు. ఆ రోజు పొద్దుపోయే వరకు అక్కడే గడిపారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లి విరాట్ కోహ్లీతో షికారు చేసిన విషయం తెలిసిందే.