ఏకాంతంగా ఉన్న లవర్స్ ఫోటో తీసి డ్రైవర్ బెదిరింపు
హైదరాబాద్: ప్రేమికులను అడ్డగించి బెదిరించిన ఓ ఆటో డ్రైవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఖమమం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతను మైసమ్మగూడలోని ఓ మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.
ఈ ప్రేమికులు ఇద్దరు కూడా గురువారం కాలేజీ అయ్యాక బైక్ పైన ఫారెస్ట్ అకాడమీ వద్ద నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ కూర్చొని వారు మాట్లాడుకుంటుండడాన్ని గమనించిన దూలపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రజనీకాంత్ వెనుక నుండి సెల్ ఫోన్లో ఫోటో తీశాడు.
వారి పైన ప్రశ్నల వర్షం కురిపించాడు. పోలీసులకు పట్టిస్తామని, మీ వారికి చెబుతామని బెదిరించాడు. ఎవరికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, తమ వద్ద డబ్బులు లేవని, స్నేహితులను పిలిచి డబ్బులు తెప్పిస్తానని చెప్పాడు.
వారు వచ్చాక అందరు కలిసి ఆయనను చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు మోదు చేశారు.
అతివేగంతో ఇద్దరు మృతి
స్నేహితుల కారు షికారు రెండు నిండు ప్రాణాలు బలిగొంది. ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో లోపల కూర్చున్న ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
రామంతాపూర్కు చెందిన భాస్కర్ కారు డ్రైవర్. తన స్నేహితుడు పని చేసే మెకానిక్ షెడ్డుకు మరమ్మతు కోసం వచ్చిన వెటిరో కారును బుధవారం రాత్రి తీసుకొని హబ్సిగూడకు వెళ్లాడు. అక్కడ వైష్ణవ్, నరేందర్, శివలను కలిశాడు. వైష్ణవ్ కారు నడిపాడు. కాచిగుడ వద్ద చిన్న, ఆకాష్ అనే మరో ఇద్దరు స్నేహితులను ఎక్కించుకున్నారు. అఫ్జల్ గంజులోని కౌషిక్ అనే స్నేహితుడ్ని తీసుకొని కార్వాన్లోని ఫ్రెండ్ బర్త్ డేకు వెళ్లి తిరిగి వస్తున్నారు.
ఆ సమయంలో కొందరు మద్యం సేవించారని సమాచారం. కౌషిక్ను అప్జల్ గంజ్ వద్ద అర్ధరాత్రి దింపారు. చాదర్ ఘట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వద్దకు వచ్చాక డివైడర్ను బలంగా ఢీకొంది. ముందు సీట్లో ఉన్న వరుణ్ రాజ్ అక్కడికి అక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ నరేందర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మిగతా వారు గాయపడ్డారు. కారు నడిపిన వైష్ణవ్ పైన కేసు నమోదు చేశారు.