హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రవర్తనపై అనుమానం: అక్కల్ని చంపిన తమ్ముడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇద్దరు అక్కలను ఓ వ్యక్తి హత్య చేసిన సంఘటన హైదరాబాదులో జరిగింది. ప్రవర్తను మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో తన తోబుట్టువుల గొంతు నులిమి చంపేశాడీ తమ్ముడు.

సైదాబాద్‌లోని పూసలబస్తీలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలం కలిగించింది. ఉత్తరప్రదేశ్‌ లక్నో జిల్లా ఫైజాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి సైదాబాద్‌కు వలస వచ్చాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Brother kills his two sisters

కుమార్తెల్లో ఒకరికి వివాహం కాలేదు. మరో యువతికి వివాహం జరిగినప్పటికీ భర్తతో విడిపోవడం జరిగింది. తమ్ముడు మాదన్నపేటలో మురుకుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అక్కలిద్దరు కూడా అందులోనే పని చేస్తున్నారు. కొంతకాలంగా తన అక్కల ప్రవర్తన పైన తమ్ముడు అనుమానం పెంచుకున్నాడు.

ప్రవర్తన తీరు మార్చుకోవాలని పలుమార్లు వారిని హెచ్చరించాడు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో శనివారం సాయంత్రం.. అక్కలిద్దరితో గొడవపడి ఓ తాడుతో వారిని గొంతునులిమి చంపేశాడు. అనంతరం సైదాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తల్లిదండ్రుల ఇంటికి వచ్చాక ఘటన గురించి తెలిసి విలపించారు.

English summary
Brother kills his two sisters in Hyderabad on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X