4గేళ్ల చిన్నారిపై రేప్యత్నం, 'కిడ్నాప్' కలకలం
దీంతో భీతిల్లిన బాలిక కేకలు వేయడంతో తల్లి, ఇరుగుపొరుగు వారు వెంటనే వెళ్లి షట్టర్ పైకి ఎత్తి బాలికను రక్షించారు. కోపోద్రిక్తులైన ప్రజలు అతనికి దేహశుద్ధి చేయడంతో అక్కడి నుడి పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాత్రి అంతా గాలించగా.. గురువారం తెల్లవారుజామున సికింద్రాబాదులో సురేష్ను అరెస్టు చేశారు.
ఎయిర్ పోర్టులో కిడ్నాప్ కలకలం
శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్ పరిధిలో కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. పోలీసులు హైరానా పడ్డారు. చివరకు అది ఉత్తిదే అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శంషాబాదుకు చెందిన సిద్ధిరెడ్డి గోవా వెళ్లి వస్తుండగా.. అతన్ని రిసీవ్ చేసుకునేందుకు అతని భార్య సరిత ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే, అక్కడే దంపతులిద్దరికీ గొడవ జరిగింది. ఇద్దరు గొడవ పడుతూనే కారెక్కి శంషాబాద్ వైపు వస్తుండగా.. మార్గ మధ్యలో ఎయిర్ పోర్టు పరిధిలోని రహదారిపై కారు అర్ధాంతరంగా ఆగిపోయింది.
దీంతో సిద్ధిరెడ్డి తన మిత్రుడు ఇంద్రసేనకు కబురు పెట్టగా మరో కారు తీసుకు వచ్చాడు. అయితే, అప్పటికే గొడవ పడుతున్న సరితను కారులోకి బలవంతంగా ఎక్కిస్తుండగా.. అది కిడ్నాప్ అనుకొని స్థానికులు పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. వెంటనే కారును వెంబడించి పట్టుకున్నారు. పోలీసు స్టేషన్కు వెళ్లాక అసలు విషయం తెలిసిందే. దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
వ్యభిచార గృహంపై దాడి
హైదరాబాదులోని రామంతాపూర్లోని ఓ కాలనీలో వ్యభిచార గృహం పైన పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. నిర్వాహకులు, విటుడు, ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన ఓ మహిళ రామాంతాపూర్లోని శ్రీనివాసపురంలో ఉన్న ఓ ఇంట్లో కొంతకాలంగా ఇద్దరు యువతులతో వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు బుధవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. సీతాఫల్ మండికి చెందిన విటుడిని, ఇద్దరు సెక్స్ వర్కర్లు, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని, గురువారం రిమాండుకు పంపారు.