మెట్రోపై కేసీఆర్కు కోదండ, కోర్టుకు వెళ్లిన రేవంత్
చర్చల అనంతరం ఎల్ అండ్ టీ, ప్రభుత్వం ఇచ్చిన వివరణలు సరిగా లేవన్నారు. మరో నేత మహేష్ మాట్లాడుతూ.. కాన్వాయ్లోని కార్ల రంగును, క్యాంపు కార్యాలయాలను మార్చినంత సులువుగా మెట్రో అలైన్మెంట్ మార్చవచ్చని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఫీజుల పెంపు జీవోలను కొట్టేయండి: రేవంత్ రెడ్డి
ప్రయివేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఫీజులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవోలు 9, 10లను సవాల్ చేస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సుప్రీం కోర్టు రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించేవిగా ఉన్న ఆ జీవోలను కొట్టేయాలన్నారు.
విద్యార్థుల ఆర్థిక స్థోమతను బట్టి ప్రవేశాలు కల్పించడం కోసం 15 శాతం వెయిటేజీ మార్కులను యాజమాన్యాలే నిర్ణయించుకునేలా ప్రభుత్వం ఆ జీవోలలో ఉద్దేశ్యపూర్వకంగా వెసులుబాటు కల్పించిందన్నారు. దీంతో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 32లను ఉల్లంఘించేవిగా ఉన్న ఈ రెండు జీవోలను కొట్టివేయాలని పిటిషన్లో కోరారు.