పిక్ పాకెట్: తెలగ పాముల ముఠా పట్టివేత
హైదరాబాద్: రద్దీగా ఉండే బస్సుల్లో ఎక్కి చిన్న పిల్లలను గిచ్చి ఏడ్పించి ప్రయాణికుల దృష్టి మరల్చగానే వారి వస్తువులు దోచుకెళ్లే ముఠాను హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పంజగుట్ట ఎసిపి కార్యాలయంలో ఎసిపి వెంకటేశ్వర్లు ముఠా వివరాలను వెల్లడించారు.
కడప జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లాలోని డోన్ ప్రాంతాలకు చెందిన తెలగ పాముల తెగకు చెందిన కొందురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం పోలీసులకు చిక్కినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం.
వీరంతా పలు సార్లు జైలు శిక్ష అనుభవించినవారే. వారి నుంచి ఎనిమిది సెల్ఫోన్లు, ఒక ట్యాబ్లెట్, రూ. 10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కవ్వాడి కుమారి (35), కవ్వాడి రాధ (33) అమ్మురు లక్ష్మి (50), కవ్వాడి కార్తిక్ (20), అమ్మురు చిరంజీవి (21) ఉన్నారు. కవ్వాడి శ్రీను పరారీలో ఉన్నట్లు తెలిపారు.