హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొంతు కోసుకుని పైనుంచి దూకి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త అనారోగ్యం, ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు.. తట్టుకోలేక ఓ మహిళ గొంతు కోసుకుని ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఆ విషాదకరమైన సంఘఠన మైలార్‌దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్సై మహేంద్రనాథ్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పాతబస్తీ గౌలిపురాలో ఉండే కమలమ్మ కూతురు మీనా (33)కు మైలార్‌దేవుపల్లి డివిజన్ పద్మశాలిపురం బస్తీలో ఉండే చేవూరి యాదయ్యతో 14 ఏళ్ల కిందట వివాహమైంది.

యాదయ్య వృత్తిరీత్యా దర్జీ. వారికి మనిషా (13), రాహుల్ (9) అనే పిల్లలు ఉన్నారు. రెండు నెలల కిందట యాదయ్య అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షలు చేయగా అతనికి కిడ్నీలు పాడైనట్లు తేలింది. దీంతో పాటు అల్సర్ కూడా ఉండడంతో రెండు నెలన్నర రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. దీంతో పాటు మీనా, యాదయ్యల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.

మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య

పలు సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన మీనా అనే మహిళ వంట గదిలోని కత్తితో గొంతు కోసుకుని పక్కనే ఉన్న బాల్కనీ నుంచి దూకింది. దీంతో ఆమె మరణించింది.

మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య

వృత్తిరీత్యా దర్జీ అయిన భర్త యాదయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నెలన్నర రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. దీంతో మీనా విరక్తి చెందింది.

మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య

గొంతు కోసుకుని బాల్కనీ నుంచి కిందికి దూకి మీనా ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలంలో స్థానికులు ఈ విషాద దృశ్యానికి తలుచుకుంటూ..

మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య

మీనా అనే మహిళ జీవితంపై విరక్తి చెంది గొంతు కోసుకుని బాల్కనీ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.

English summary
A woman Meena committed suicide in Mylardevpalli PS limits in Hyderabad jumping from balcony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X