మిన్నెసోటా ప్రవాసాంధ్రుల వితరణ

శుక్రవారం, అక్టోబర్ 23, 2009, 9:11 [IST]
NRI
మిన్నెసోటా: తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ మిన్నెసోటా బృందం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. జెఫర్‌సన్‌ ఉన్నత పాఠశాల, బ్లూమింగ్‌టన్‌ ప్రాంతంలో నిర్వహించిన వేడుకల్లో దాదాపు 800మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల సహాయం కోసం 1200 అమెరికన్‌ డాలర్లు, 12 పెట్టెల దుస్తులను సేకరించారు. ఈనెల 25 వరకు వరద సహాయనిధికి చెక్కులను, దుస్తులను అన్ని ఇండియన్ స్టోర్స్ లో తీసుకుంటామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

అసోషియేషన్‌ అధ్యక్షులు కిరణ్‌, ఉపాధ్యక్షులు వసంత్‌, కల్చరల్‌ సెక్రటరీ పద్మా బెరవోలె, మార్కెటింగ్‌ కార్యదర్శి వెంకటభూపతిరాజు, కోశాధికారి జీపీరావు తదితరులు పాల్గొన్నారు. 100 మంది చిన్నారులతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సుపర్ణ చాగంటి, ప్రియ వాసిరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. 2010 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వసంత్‌, ఉపాధ్యక్షులుగా హరి, ప్రధానకార్యదర్శిగా జీపీ రావు, కోశాధికారిగా సుధీర్‌, కల్చరల్‌ సెక్రటరీగా పద్మా, మార్కెటింగ్‌ కార్యదర్శిగా నాయుడు, వెబ్‌ కో-ఆర్డినేటర్‌గా ఈశ్వర్‌, ఈవెంట్‌ కో-ఆర్డినేటర్‌గా శైలజ, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్‌, ఊర్మిల, రామ్‌, కిషోర్‌, శిరీష, కిరణ్‌లను ఎన్నుకున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs