గల్ఫ్లో తెలంగాణవారికి సీమాంధ్రుల సాయం: పట్టని నేతలు
తెలంగాణ వాదాన్ని నెత్తిన పెట్టుకొని నిత్యం ప్రచార సాధనాలలో ఊదరగొట్టే ఓ స్థానిక ఎంపీ సైతం హామీనిచ్చినప్పటికీ అది నెరవేరలేదని తెలుస్తోంది. కానీ ప్రాంతీయ తత్వాలను పక్కన పెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన సలీం మాత్రం నడుం బిగించాడు. ఆయన కూడా గల్ఫ్లో పెద్ద డబ్బున్న వాడు కాదు. మామూలు సైకిల్ దుకాణం నడుపుకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఆయనది చిత్తూరు జిల్లా. అలాంటి సాధారణ వ్యక్తి ప్రాంతీయ భావాలను పక్కన పెట్టి మానవత్వాన్ని తన మదిలో నింపుకొని వారం రోజుల పాటు అక్కడ ఉండే భారతీయులను కలిసి పరిస్థితి వివరించి డబ్బులు సేకరించి స్వామి మృతదేహం సొంత రాష్ట్రానికి రావడానికి సహాయపడ్డాడు. ఇదొక్కటే ఉదాహరణ కాదు. గతంలో తెరాస పార్టీ శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి ఓమన్లో మరణించగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లూరి హరిబాబు మస్కట్కు తీసుకు వచ్చి హైదరాబాద్ పంపించి మానవత్వం కలిగిన తమకు ప్రాంతీయ విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు.